టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..!

-

యువ భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న గిల్ సేన టీ 20 సిరీస్పై కన్నేసింది. ఇవాళ నాలుగో టీ20లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. ఈ సిరీస్ ను ఘోర పరాజయంతో మొదలుపెట్టిన భారత్ ఆ తర్వాత లోపాలను అధిగమించింది. వరుసగా రెండు మ్యాచ్లోనూ విజయం సాధించింది. నాలుగో టీ20లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నది. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో గిల్ టచ్లోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా రాణిస్తుండటం ప్రధాన బలం. మూడో టీ20కి జైశ్వాల్, శాంసన్, దూబె రాకతో జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో తుషార్ దేశ్ పాండే ఆరంగేట్రం చేస్తున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో టీ 20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

భారత జట్టు : శుబ్ మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, శివమ్ దూబే, అభిషేక్, రుతురాజ్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్, తుషార్ దేశ్ పాండే.

జింబాబ్వే : మాధెవెరె, మారుమణి, బెన్నెట్, మయర్సు, రజా (కెప్టెన్), కాంప్ బెల్, మదాండే, ముజరబానీ, చటారా, నగరవ, ఫరాజ్ అక్రమ్.

Read more RELATED
Recommended to you

Latest news