యనమల కూతురిపై మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు

-

కాకినాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వైసిపి – టిడిపి మధ్య సాగుతున్న పొలిటికల్ వారు లో భాగంగా మాటల యుద్ధం తీవ్రమౌతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా గత టిడిపి ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నేడు తుని మండలం కొత్త సురవరంలో జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. మొగుడ్ని వదిలేసి తుని వచ్చి రాజకీయం చేయడం యనమల కూతురికి ఎక్కడ కుదురుతుంది? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని కూతురికే కాదు నా కూతురికి కూడా ఇక్కడ కుదరదన్నారు. వంగవీటి రంగా ఎదుగుతున్నాడని చంద్రబాబు, ఎన్టీఆర్ అరాచకంగా చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చేది లేదు చచ్చేది లేదని.. హామీలు మాత్రం ఇస్తాడని అన్నారు. తన కూతురుని గెలిపించాలని యనమల మోకాళ్ళ యాత్ర చేస్తున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news