బెంజ్ కారు ఆరోపణల మీద స్పందించిన మంత్రి.. రాజీనామాకి సిద్దం !

-

ఏపీ కార్మికశాఖ మంత్రి జయరాంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రస్తుత ఏపీ మంత్రి మీద సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడికి ఓ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి బెంజి కారు లంచంగా ఇచ్చాడని ఆరోపించారు. మంత్రి జయరాంకు ఓ కేసులో ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని, అందుకే ఆయన కుమారుడికి బెంజి కారు గిఫ్ట్‌గా ఇచ్చాడని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు బెంజి కారు ఇస్తున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు అయ్యన్న పాత్రుడు. అంతే కాక ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశారు ఆయన.

ఈ విషయం మీద స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం బెంజి కారు నా కుమారునిది కాదని అన్నారు. వేరే వాళ్ళ కారు పక్కన ఫోటో దిగాడు అంతేనని అన్నారు. హెలికాఫ్టర్ దగ్గర లేక ట్రైన్ దగ్గర ఫోటో తీసుకుంటే అవి మనవే అవుతాయా ? అని ఆయన ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రతిపక్ష నేత చంద్రబాబు మాయల ఫకీర్ లాంటి వాడని అన్నారు. ఎవరిని ఏ ఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news