పిఠాపురం లో 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం..!

-

పిఠాపురం ఇందిరానగర్ లో 16 ఏళ్ల మైనర్ బాలిక పై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. మైనర్ బాలిక కు మద్యం పట్టించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ కేసులో నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు గా గుర్తించారు. అయితే ఈ ఘటనలో జాన్ బాబుకు మరో మహిళ కూడా సహకరించినట్లు తెలుస్తుంది.

అయితే సదరు మైనర్ బాలికను బలవంతంగా ఆటో ఎక్కించి డంపింగ్ యార్డ్ దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉంది సదరు బాలిక. అలాగే జాన్ బాబు అలాగే అతనికి సకరించిన మహిళ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఈ ఘటన పై పోలీసులు విచారిస్తుంటే.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు జాన్ బాబు. ఆటో ఎందుకు ఎక్కించుకున్నావంటే మామూలుగానే ఎక్కించుకున్నాను మీరు ఏం చేసినా పర్వాలేదని పోలీసులకు సమాధానం చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version