ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు.. బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలయ్యపై కేసులు..!

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో భాగంగా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు…రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అటు నారా లోకేష్ ను కూడా రేపు అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ రెబల్ ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నెల్లూరు జిల్లా టీడీపీ, జనసేన నాయకులు సీపీఐ పార్టీ నాయకులతో కలిసి ఐక్య కార్యాచరణపై ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ చర్చించారు. ఈ సందర్భంగా ఆనం  మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసన గా అక్టోబర్ 2న  గాంధీ జయంతి రోజున శాంతియుత ర్యాలీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం కలిసి పోరాడుదామని వెల్లడించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు, వేధింపులు చేస్తున్నారు అని ఆనం తెలిపారు, దీని కోసం అందరం కలసి పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news