BREAKING: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఊరట

-

MLA Raghuramakrishna Raju gets relief in Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఇంద్‌-భారత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

MLA Raghuramakrishna Raju gets relief in Telangana High Court

కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన RBI, ఎస్‌బీఐలను ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఇది ఇలా ఉండగా, జగన్‌ సీఎం గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చాలా ఇబ్బందులే పడ్డాడు. జైలుకు కూడా వెళ్లారు. అయితే.. ఇప్పుడు ఉండి ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు పని చేస్తున్నారు.  టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామకృష్ణరాజు.

Read more RELATED
Recommended to you

Latest news