ఎమ్మెల్సీది యాక్సిడెంట్ కాదు.. హత్య : సాబ్జీ సోదరుడు

-

ఎమ్మెల్సీ సాబ్జీది యాక్సిడెంట్ కాదు.. హత్య అని సంచలన ఆరోపణలు చేశారు సాబ్జీ సోదరుడు. పశ్చిమగోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడలో కారు యాక్సిడెంట్ లో సాబ్జీ మృతి చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

mlc died in road accident

ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి షేక్ సాబ్జి కారును ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే..కారు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాబ్జీది యాక్సిడెంట్ కాదని హత్యేనని ఆయన సోదరుడు ఫరీద్ ఖాసిం ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా నలుగురు వ్యక్తులు కారుతో 150kmph స్పీడ్ తో ఢీకొట్టారని అన్నారు. ప్రమాద స్థలాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పారు. ఈ విషయంలో సరైన ఎంక్వయిరీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news