చంద్రబాబు కనుసన్నళ్ళో షర్మిల నడవడం దుర్మాగం : ఎమ్మెల్సీ కళ్యాణి

-

షర్మిల మాటలు వైఎస్ఆర్ కుమార్తే మాటల్లా లేవు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా మాట్లాడుతున్నారు అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారు. షర్మిల మాటలు వింటుంటే ఈమె వైఎస్ఆర్ కుమార్తె నా అనేలా ఉంది. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి స్వర్గంలో వైఎస్ఆర్ కూడా బాధపడతారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుంది. చంద్రబాబు అడుగుజాడల్లో షర్మిల నడుస్తున్నారు. ఈడీ కేసుల్లో భారతి గారి ఆస్తులు కూడా జప్తు చేశారు. నాడు కేసుల్లో వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ పెట్టింది.

నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పోరాడి వైఎస్ఆర్ పేరును తొలగించారు. తప్పుడు మార్గంలో షేర్లు బదిలీ చేశారని జగన్ కోర్టుకు వెళ్ళారు. షర్మిల అండ్ కొ చేసే కీడు నుంచి తప్పించుకోడానికి మాత్రమే జగన్ కోర్టుకు వెళ్లారు. జగన్ బెయిల్ రద్దు అయితే లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి. సొంత అన్న కోసం ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడుతారా. రక్తం పంచుకొని పుట్టిన అన్న కోసం ఇలా మాట్లాడటం దుర్మార్గం. మహిళలను గొప్పగా చూసే వ్యక్తి వైఎస్ జగన్. షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరూ నమ్మరు. 2019 లో షర్మిల అధికారంలోకి తీసుకొస్తే.. 2014 లో ఎందుకు అధికారానికి దూరం అయ్యాం. షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు కనుసన్నళ్ళో నడవడం దుర్మాగం. వైఎస్ఆర్ వారసత్వన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది. షర్మిల చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలి అని వరుదు కళ్యాణి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version