వైఎస్ షర్మిలకు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ షర్మిలకు సంబంధం లేని విషయంలో భారతమ్మ ఎందుకు క్షమాపణలు చెప్పాలి? అని డిమాండ్ చేశారు. భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వాళ్లు ఈ రోజు ఆమె గురించి మాట్లాడుతున్నారన్నారు.

వైఎస్ భారతమ్మ ఎప్పుడైనా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడారా? ఎవరినైనా కించేపరిచేలా మాట్లాడారా? అని ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. షర్మిలపై సుంకర సమరశంఖం అంటూ పేర్కొన్నారు. షర్మిలకు కుటుంబ తగాదాలే తప్ప పార్టీ పట్టలేదని వెల్లడించారు. కూటమి స్క్రిప్టు ను చదువుతూ విమర్శలు చేశారు. అధికార పార్టీ ప్రశ్నసించకుండా ప్రతి పక్ష పార్టీని ప్రశ్నిస్తుందని మండిపడ్డారు.