ఒంగోలులో కలకలం రేపిన శిశువు విక్రయం..!

-

ఒంగోలులో శిశువు విక్రయం ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో పది వేలకి కన్న కూతురుని అమ్మేసింది అంగన్వాడీ కార్యకర్త మంజుల. తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఖమ్మం జిల్లా కల్లూరుకి లో ఉండే బాలసుందరరావుకి మధ్యవర్తుల ద్వారా కూతురుని విక్రయించింది. పాప పుట్టిన తర్వాత అమ్మి రిమ్స్ లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది అంగన్వాడీ కార్యకర్త.

అయితే చాల రోజులుగా రక్త హీనత వంటి అనారోగ్య సమస్యలతో అంగన్వాడీ కార్యకర్త మంజుల బాధపడుతుంది. కానీ మంజుల బిడ్డ పుట్టిన వెంటనే ఆసుపత్రిలో చెప్పకుండా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి.. బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేసారు రిమ్స్ లోని వైద్యులు. ఇక ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోని దిగిన పోలీసులు విచారణ చెప్పటి.. పాపా విక్రయం గురించి తెలుసుకొని.. పాపని తిరిగి క్షేమంగా తీసుకువచ్చారు పోలీసులు. అలాగే ఈ ఘటనపై ఇంకా తమ దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు పోలీసులు. మంజుల పాపా అమ్మడానికి సహాయం చేసిన మధ్య వర్తి గురించి గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news