తిరుమల లడ్డూ వివాదంపై ఎంపీ అవినాష్‌ సంచలన వ్యాఖ్యలు !

-

తిరుమల లడ్డూ వివాదంపై ఎంపీ అవినాష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో తిరుమల లడ్డుపై ఆరోపణలు చేశారని..తిరుమల ఈవో టాంకర్లు వచ్చాయి టెస్ట్ చేసాము వెనక్కు పంపామని స్పష్టంగా చెప్పారని ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ నెయ్యితో లడ్డు తయారు చేశామని అంటున్నారు..సుప్రీంకోర్టు కామెంట్ చేసిన తర్వాత ఆ నెయ్యి వాడారు లడ్డుకు వాడారా లేదా మరి దేనికైనా వాడారు నాకు తెలియదని బాబు చెబుతున్నాడని మండిపడ్డారు వైయస్ అవినాష్ రెడ్డి.

MP Avinash made sensational comments on the Tirumala Laddu controversy

ఈవోది ఒక స్టాండు చంద్రబాబు నాయుడు ఒక స్టాండ్ లోకేష్ ఇది ఒక స్టాండ్ పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్…వాళ్లది వాళ్లకే సరితూగడం లేదని సెటైర్లు పేల్చారు వైయస్ అవినాష్ రెడ్డి. ఎవరికి వారిగా అబద్ధాలు చెబుతున్నారు… సుప్రీంకోర్టు వేసిన మొటికాయల నేపథ్యంలో ఇప్పటికైనా దేవుడిని అడ్డు పెట్టుకొని ఇటువంటి కాంట్రవర్సీ చేయకూడదని చంద్రబాబు నాయుడుకి బిజెపికి హితువు చెబుతున్నా అంటూ ఆగ్రహించారు వైయస్ అవినాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news