BREAKING : సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి దూరం

-

సీబీఐ విచారణకు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి దూరం అయ్యారు. వివేక కేసు లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నేడు CBI ముందు హాజరు కావాల్సి ఉంది అవినాష్ రెడ్డి. మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న… కడప MP అవినాష్ రెడ్డి ఇవాళ మరోసారి CBI విచారణకు హాజరు కావాల్సి ఉంది.

అయితే.. చివరి క్షణంలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి. తన తల్లి అనారోగ్యంతో పులివెందులకు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పులివెందుల బయల్దేరారు ఎంపీ అవినాష్‌రెడ్డి. దీంతో సీబీఐ విచారణకు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి దూరం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version