పరిటాల రవీంద్ర హత్య కేసు నిందితులను చంపిన కుట్రలో సీఎం జగన్ – RRR

-

పరిటాల రవీంద్ర గారి హత్య కేసు నిందితులను జైలులో చంపించింది జగన్ మోహన్ రెడ్డి గారేనని ప్రజలు అనుకుంటున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును ఓం ప్రకాష్ చేత హత్య చేయించారని, ఆ తర్వాత ఓం ప్రకాష్ ను చంపించారని… దాల్మియా సిమెంట్ లో లెక్కలు తేల్చాలని లేఖలు రాసిన వ్యక్తిని మీ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో చంపారని… ఇది మన ట్రాక్ రికార్డు అంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారిని ఉద్దేశించి అన్నారు.

Jagan successfully failed MP Raghurama Krishnam Raju's plan
Jagan successfully failed MP Raghurama Krishnam Raju’s plan

జైలులో ప్రాణభయం ఉందా?… నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా అంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఆ కేసును రీ ఓపెన్ చేద్దాం అంటే చేద్దాం అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఇంట్లో నుంచి క్యారేజ్ వస్తే… భోజనంలో తేడా వల్లే అనారోగ్యం పాలై ఉంటారని, జైలు అంటే జైలు లాగే ఉంటుందని, ఏసీ ఏర్పాటు చేయాలని కోరుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా రఘురామకృష్ణ రాజు గారు తీవ్రంగా స్పందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news