ముద్రగడ సంచలనం…. అధికారికంగా మారిన పేరు….!

-

మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత వంగా గీతపై ఘనవిజయం సాధించారు.

A twist on Mudragada Padmanabham’s inclusion in YCP

అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగిన సమయంలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన సవాల్ విసిరారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే తాను పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శపథం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news