21కి 21 గెలవబోతున్నాం… నాగబాబు సంచలన ప్రకటన

-

21కి 21 గెలవబోతున్నాం అంటూ… నాగబాబు సంచలన ప్రకటన చేశాడు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. పార్టీ నేతలతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు అనుభవం, బిజెపి మద్దతు ఫలించాయి. జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా మన అందరి ఆలోచన ఉండాలి. పవన్ పూనుకోకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భూబకాసురుల దోపిడీకి బలైపోయే పరిస్థితి వచ్చేది’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news