చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ మండుతున్న ఎండలు.. 43.9 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

-

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొద్దిరోజుల గ్యాప్ తరువాత మళ్లీ పెరిగింది. ఒకవైపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా మరి కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం రోజున రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో 43.4, కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం చాప్రాలలో 43.2, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో 43.1 డిగ్రీల సెల్సియస్‌ ఉందని వెల్లడించారు.

ఇక హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోని పలు సర్కిళ్లలో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడ్డారని వివరించారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా కొడంగల్, నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ తెలిపింది. మరో 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలున్నాయని .. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడొచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news