వైసీపీ మంత్రులకు నాగబాబు కౌంటర్

-

వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు వరుసబెట్టి చిరంజీవిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు జనసేన నేత, సినీ నటుడు నాగబాబు. చిరంజీవిని మంత్రులు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు ఈరోజు కారుకూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనా పైసలతో సహా కట్టి వినోదాన్ని, విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ అని అన్నారు. ఏ పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు.. నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారని మండిపడ్డారు. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మంత్రులకు అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియదని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కి అకౌంట్లో మనీ వేస్తే అభివృద్ధి జరిగినట్టా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news