చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడిపోతుంది – వైసీపీ ఎమ్మెల్యే

-

చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడిపోతుందని వెల్లడించారు వైసీపీ కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు వందన కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి….అనంతరం మాట్లాడారు.

మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయకత్వంలో డ్రామాలు.. నాటకాలు ..వేషాలు వేస్తున్నారు…ఎన్టీ రామారావు మీద చాలా ప్రేమ కురిపిస్తున్నారు పేపర్లలో ఎన్టీ రామారావు కృష్ణుడు బొమ్మ వేసి ఈరోజు యాడ్స్ ఇచ్చారని వెల్లడించారు. ఇదే ఎన్టీ రామారావు ని వైస్రాయ్ హోటల్ లో చెప్పులేసి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు…మనము భగవంతుని చూడలేదు భగవంతుడి రూపంలో ఎన్టీ రామారావును చూస్తున్నామని వెల్లడించారు. ఎన్టీ రామారావు ని ముఖ్యమంత్రిగా దించే విషయంలో స్టోరీ. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఈనాడు రామోజీరావుదేనని ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news