నేడు కడప జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి..

-

నేడు కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి..పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక మనోవేదనతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మధ్యాహ్నం 1గంటకు తిరుమల నుంచి రైల్వే కోడూరు చేరుకోనున్నారు భువనేశ్వరి.

ఇక రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరికి ఘన స్వాగతం పలకనున్నారు పార్టీ శ్రేణులు. సాయంత్రం 6.30గంటలకు పోరుమామిళ్లకు చేరుకోనున్న భువనేశ్వరి..పోరుమామిళ్ల మండలం కోట వీధి, బలిజ కోటలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం బద్వేల్ కు చేరుకోనున్న నారా భువనేశ్వరి.. రాత్రికి బద్వేల్ పట్టణం ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో బస చేస్తారు. 22వ తేదీ ఉదయం బి కోడూరు, మండలం గుంతపల్లి, కలసపాడు మండలం లింగారెడ్డి పల్లె, బ్రాహ్మణ పల్లె, తెల్లపాడు గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు నారా భువనేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news