ఫారుఖ్‌, భూమా బ్రహ్మానంద రెడ్డి మధ్య రాజీ కుదిర్చిన నారా లోకేష్ !

-

 

నంద్యాల టీడీపీ పార్టీలో మొన్నటి వరకు అంతర్యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. టిడిపి అభ్యర్థి ఫారుక్ , అసంతృప్తి నేత మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మధ్య గోడవలు చోటు చేసుకున్నాయి. అయితే.. తాజాగా టిడిపి అభ్యర్థి ఫారుక్ , అసంతృప్తి నేత మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మధ్య రాజీ కుదిర్చారు నారా లోకేష్.

Nara Lokesh made a compromise between Farooq and Bhuma Brahmananda Reddy

ఉరవకొండలో ఇద్దరితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి తులసి రెడ్డిలతో మాట్లాడారు నారా లోకేష్. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక భూమా బ్రహ్మానంద రెడ్డికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్‌. దీంతో కలిసి పని చేస్తామని లోకేష్ సమక్షంలో ప్రకటించారు ఫారుక్, భూమా బ్రహ్మానంద రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news