అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతాం : నారా లోకేశ్ ప్రకటన

-

అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని నారా లోకేశ్ ప్రకటన చేశారు. TDP అధికారంలోకి వచ్చాక బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని లోకేష్ హామీ ఇచ్చారు. ‘బీసీల పాలిట సైతాన్ గా మారిన జగన్ రెడ్డిని సాగనంపాలి.

వైసీపీ నేతల వేధింపులు తారలేక ముస్లింలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాము గతంలో బిజెపితో కలిసి ఉన్న మైనార్టీలపై దాడులు జరగలేదు. హాజ్ యాత్రకు పంపించాం’ అని వివరించారు. మన జయహో బీసీ కార్యక్రమం చూసి జగన్ గజ గజా వణికిపోయాడు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ వైసీపీ బీసీ నేతల్ని రంగంలోకి దింపి నన్ను తిట్టించాడు. కనీసం నన్ను తిట్టడానికైనా వైసీపీలో ఉన్న బీసీ నేతలకి మాట్లాడే అవకాశం ఇచ్చాడని తెలిపారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news