ఏపీ పోలీసులపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. బరితెగించారంటూ !

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందని ఫైర్ అయ్యారు. తమ పై వైసీపీ దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకి కొమ్ముకాస్తూనే వున్నారు ఖాకీలు అంటూ అగ్రహించారు నారా లోకేష్.

ప్రభుత్వ తొత్తులుగా మారి ప్రశ్నించే ప్రజలు-ప్రతిపక్ష టిడిపి పై దాడులకీ తెగబడ్డారని ఫైర్ అయ్యారు నారా లోకేష్. ఇన్ని చేసినా కొంతమంది పోలీసులూ చివరికి వైసీపీ బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండి పై మద్యం, బిర్యానీ పెట్టడం బరితెగింపే అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్.

సీఐపై మంత్రి చీదర పని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై ఎంపీ సురేష్ దాడి.. పోలీసులకే రక్షణలేని రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేదెవరు ? అని నిలదీశారు. టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తెలచుతామని హెచ్చరించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version