జబర్దస్త్ ఆంటీ…జబర్దస్థ్ గా భూకబ్జాలు చేస్తోంది – లోకేష్

-

జబర్దస్త్ ఆంటీ…జబర్దస్థ్ గా భూకబ్జాలు చేస్తోందని నారా లోకేష్ విమర్శలు చేశారు. చిన్నరాజు కుప్పంలో లోకేష్ ప్రసంగించారు. జగన్ జిల్లాకో సైకోను తయారు చేశారని మండిపడ్డారు. పెద్దిరెడ్డికి తోడు మరో సైకోను తయారు చేశారని ఆగ్రహించారు. పెద్దిరెడ్డికి తోడు నగరి శాసనసభ్యురాలు రోజా జబర్దస్త్ ఆంటీ తోడయ్యారని మండిపడ్డారు. రోజా మంత్రి అయ్యాక నియోజకవర్గాన్ని కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిందని… జబర్దస్త్ ఆంటీ భూకబ్జాలు జబర్దస్థ్ గా చేస్తోందని చురకలు అంటించారు.

రాత్రి కుటుంబ సభ్యులు అంతా సమావేశమై దోపిడీ సొమ్ము పంచుతకొంటున్నారని… విదేశాలకు వెళ్లడంపై ఉన్న ద్యాస నగరి చేనేత కార్మికులుపై పెట్టండని కోరారు. బాబాయిని చంపిన కేసులో సీబీఐ భారతిరెడ్డి పీఏ ను విచారించారని… కేసుల నుంచి బయటపడటానికి ప్రత్యేక హోదాను అడగటం లేదని ఫైర్‌ అయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు… కల్తీ మద్యం అమ్ముతున్నాడు… పెన్షన్లు పెంచుతా పోతానని….పెంచలేదని మండిపడ్డారు. ఒక్కో లబ్ధిదారు నుంచి రూ. 30 వేలు ఎగురకొట్టాడు… కంత్రీ జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో నిలిచిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news