BREAKING : నేడు ఢిల్లీ వెళ్లనున్న నారా లోకేష్‌

-

నేడు ఢిల్లీ వెళ్లనున్నారు నారా లోకేష్‌. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి పయనం కానున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు నేపథ్యంలో మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు నారా లోకేష్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ పార్టీ నేతలు. అక్కడే వారం రోజుల పాటు నారా లోకేష్‌ ఉండే ఛాన్స్‌ ఉంది.

ఇది ఇలా ఉండగా, చంద్రబాబు అరెస్ట్‌ తరుణంలో.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ పార్టీ. నేడు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ క్రాంతితో క్రాంతి వినూత్న నిరసనకు టీడీపీ పిలుపు నిచ్చింది. ఇవాళ రాత్రి 7 గంటలకు సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు. ఇళ్లలో లైట్లు ఆర్పి బయట కు వచ్చి ఐదు నిమిషాలు లైట్లు వెలిగించాలని పిలుపు నిచ్చారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ కొట్టాలని నారా లోకేష్ పిలుపు నిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version