‘చంద్రయాన్-3 ది ఎండ్’.. ఆశల్లేవు.. ఇక ముగిసినట్టే

-

ప్రపంచంలోనే జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న దిగి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే 14 రోజుల పాటు చంద్రయాన్-3లోని ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. చంద్రుడిపై చీకటి కావడం వల్ల సెప్టెంబర్‌ 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు.

14 రోజుల తర్వాత సెప్టెంబర్‌ 22న అక్కడ సూర్యోదయం కావడం వల్ల ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేయడం షురూ చేశారు. అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా అవి .. ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదు. వాటిని మేల్కొలిపేందుకు ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో రోజురోజుకు చంద్రయాన్-3పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే చంద్రయాన్‌-3 ప్రాజెక్టు ఇక ముగిసేనట్లేనని ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదని.. ఒక వేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేదని అన్నారు. చంద్రయాన్‌-3ని విశాల దృక్కోణంలో చూసినప్పుడు అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందని.. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువం పై చంద్రయాన్‌ కాలుమోపి.. ఇప్పటికే ఆ రీజియన్‌ నుంచి విలువైన సమాచారం అందిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version