కోడికత్తి కేసులో కుట్రకోణం లేదు : ఎన్‌ఐఏ

-

కోడికత్తి కేసు దర్యాప్తుపై ఎన్​ఐఏ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని, క్షుణ్ణంగా దర్యాప్తు చేసినందున మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి రెండో రోజైన బుధవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ఇన్‌-కెమెరా పద్ధతిలో విచారణ సాగింది.

‘ఘటనపై దర్యాప్తు ముగిశాక, కేసు విచారణ ప్రారంభమైన దశలో హఠాత్తుగా మళ్లీ లోతైన దర్యాప్తు డిమాండ్‌ తీసుకురావడం కరెక్ట్​ కాదు. ఘటనకు సంబంధించి సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాం. వీటి ప్రకారం శ్రీనివాసరావు ఒక్కడే నిందితుడని తేలింది. కుట్ర కోణం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు’ అని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది వాదించారు.

నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం సైతం లోతైన దర్యాప్తు కోసం వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దని కోరారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిందితుడు అయిదేళ్లుగా రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా మగ్గుతున్నారన్నారు. సీఎం జగన్‌, ఎన్‌ఐఏ, నిందితుడి తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తీర్పును న్యాయమూర్తి ఏ.సత్యానంద్‌ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news