వల్లభనేనికి షాక్‌..గన్నవరం సీటుపై యార్లగడ్డ సంచలన పోస్ట్‌ !

-

వల్లభనేని వంశీకి షాక్‌ ఇచ్చారు యార్లగడ్డ వెంకట్రావ్. గన్నవరం సీటుపై యార్లగడ్డ సంచలన పోస్ట్‌ చేశారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావ్ పేరుతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ గా మారింది. రానున్న రోజుల్లో గన్నవరం నియోజక వర్గానికి మంచి రోజులు వస్తాయని గట్టిగా చెబుతున్నా అని ఫేస్ బుక్ పోస్ట్ పెట్టారు.

2024లో గన్నవరం నియోజక వర్గాన్ని ఏపీలో మొదటి స్థానంలో నిలుపుతానని హామీ ఇస్తున్నా అంటూ పోస్టింగ్ చేశారు. అయితే.. గత కొన్నాళ్లుగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు యార్లగడ్డ వెంకట్రావ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్రస్తుతం వెంకట్రావ్ అందుబాటులో లేరు. విదేశాల్లో ఉన్నారట. అయితే.. ఈ పోస్ట్‌ ప్రకారం.. వల్లభనేని వంశీపై గెలిచి తీరుతానని యార్లగడ్డ పోస్ట్‌ చేశారని అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news