దేవర టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి..!

-

ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొరటాల శవ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ తో కలిసి నటించిన సినిమా ‘దేవర’. ఏ ఈమధ్యే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ అందరికి బాగా నచ్చడంతో సినిమా పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. అలాగే జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ నెల 27న థియేటర్లలోకి రానున్న దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ ల్లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజునా మొత్తం 6షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. తెల్లారి 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version