నూజివీడు టిడిపిలో భగ్గుమన్న విభేదాలు

-

ఏలూరు జిల్లా నూజివీడు టిడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ముద్రబోయినకి వ్యతిరేకంగా పార్టీ దళిత నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ దళిత నేతలను ముద్రబోయిన అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని 4 మండలాల నుండి ముద్రబోయినకు వ్యతిరేకంగా బహిరంగ సమావేశం నిర్వహించారు దళిత సంఘం నేతలు. పార్టీ అధిష్టానం టిడిపి ఇన్చార్జిని మార్చాలంటూ సమావేశంలో నినాదాలు చేశారు. ఇంచార్జ్ ముద్రబోయినను అధిష్టానం మార్చకపోతే దళితుల ఓట్లన్నీ నోటాకు వేస్తామని అంటున్నాయి దళితున్నారు సంఘాల నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news