బ్రేకింగ్ : శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

-

శిరోముండనం కేసులో నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో కర్ణాటకలోని ఉడిపి రైల్వే స్టేషన్ లో నూతన్ నాయుడుని పట్టుకున్నామని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజున ఆరు సెల్ ఫోన్లు సీజ్ చేశామని అన్నారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం ఏడు మందిని అరెస్టు చేశాం, వారిని రిమాండ్ కు తరలించామని అన్నారు.

A వన్ గా నూతన్ నాయుడు భార్య మధుప్రియ ఉందని, శిరో ముండనం చేసే ముందు చేసిన తర్వాత కూడా నూతన్ నాయుడుతో భార్య మధుప్రియ మాట్లాడినట్టు గుర్తించామని అన్నారు. నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే దళిత యువకుడి శ్రీకాంత్ కు శిరోముండనం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామన్న ఆయన నిందితులు అందరినీ అరెస్ట్ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నూతన్ నాయుడు ఫోటోలు కూడా ఆయన మీడియాకి విడుదల చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news