రెండుగా చీలిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు..పెయిడ్ ఆర్టిస్ట్‌ లు అంటూ గొడవ !

-

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రెండుగా చీలారు. ఇందులో భాగంగానే.. కాకినాడ లో పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అధ్యక్షతన ఒక సమావేశం, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ఆధ్వర్యంలో మరో సమావేశం ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆస్కార్ రావు… అధ్యక్షుడు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు.

One meeting was chaired by President Suryanarayana and another was chaired by General Secretary Oscar Rao

ఉద్యోగులకు ఏదో ఊడ పొడుస్తావ్ అనుకున్నానని… నీ ఒక్కడి బెనిఫిట్స్ చూసుకుంటున్నావు అని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నీ అబ్బ సొమ్మునా? నీ ఎదుగుదల కోసం, రాజకీయాలు కోసం సంఘం నడుపుతున్నావని ప్రశ్నించారు. నీ బాగోతం అందరికి తెలుసు. సిగ్గు లజ్జా ఉంటే ఎన్నికలు కి రా అని ఛాలెంజ్‌ విసిరారు ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version