విజయవాడ దివ్య కేసు : చంపలేదు, చనిపోదామనుకున్నాం : నాగేంద్ర

-

విజయవాడలో కలకలం రేపిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు పూటలో మలుపు తిరుగుతోంది. దివ్య తేజస్వినిని కత్తితో పొడిచి తనను కూడా గాయపరుచుకున్న ప్రేమోన్మాది నాగేంద్ర అంటూ ముందు మీడియాకి సమాచారం అందింది. అయితే గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్న నిందితుడు నాగేంద్ర పోలీసులకి కీలక సమాచారం చెప్పినట్టు తెలుస్తోంది.

మూడు సంవత్సరాల నుంచి తనకు దివ్యతో పరిచయం ఉందని, ఏడాది కిందట దివ్య బలవంతం మీదట ఆమెని పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర చెప్పినట్టు సమాచారం. దివ్యతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లానని.. పెద్దలు కాపురానికి ఒప్పుకోకపోవడంతో చనిపోదామని దివ్య చెప్పిందని ఆయన చెబుతున్నాడు. దివ్య గొంతు తాను కోయలేదని, ఆమె గొంతు ఆమె కోసుకోగా తన గొంతు తాను కోసుకున్నానని ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయానని అంటున్నారు. ఆ తర్వాత తన చేయి ఎవరు కోసారో తనకు తెలియదు అని చెబుతున్నాడు నాగేంద్ర.

Read more RELATED
Recommended to you

Exit mobile version