ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్

-

ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చాడని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాలో మాట్లాడారు.  ప్రశాంత్ కిషోర్కి ఆంధ్రాలో టీమ్ ఉందా? అతను సర్వేలు ఎప్పుడు చేసాడు. ఐ ప్యాక్ కి, ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు అన్నారు.


ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు రెండు మాటలు మాట్లాడాడు అన్నారు. రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది అని ప్రశ్నించారు.  ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు.
చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.  టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ని  పీకే చదువుతున్నాడు అన్నారు. ఎంత మంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అలాగే మధ్య ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పింది జరుగలేదన్నారు.  జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వై నాట్ 175 అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news