రాయలసీమను నెత్తుటి గాయాలసీమగా మార్చారు : బాలకృష్ణ

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా దాదాపు 45 రోజుల సమయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 45 రోజులు చాలా కీలకం కావడంతో ఓవైపు అధికార పార్టీ వైసీపీ సిద్ధం.. సిద్ధం అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ రా.. కదలిరా అంటూ చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

ఈ బహిరంగ సభలో ఒకరిపై ఒకరూ నిత్యం సెటైర్లు వేసుకోవడం.. దానికి కౌంటర్లు వేయడం పరిపాటిగా మారింది. తాజాగా పెనుగొండలో నిర్వహించిన రా.. కదలిరా సభలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాయల సీమ నెత్తుటి గాయాల సీమగా మార్చారు అని  ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు బాలకృష్ణ. అప్పులు చేయకుంటే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అన్నారు. ఐదేళ్లు పూర్తి అవుతున్నా పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలో నడుస్తున్నది రాక్షస పాలన అని.. టీడీపీ ప్రభుత్వం రాయలసీమను రాయల్ సీమగా చేస్తే..  వైసీపీ ప్రభుత్వం నెత్తుటి గాయాల సీమగా మార్చిందని మండిపడ్డారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news