వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ బిర్యానీ కోసం పోతే.. పోలీసులు బాగా వడ్డించేశారు భయ్యా

-

కొత్తగా హోటల్ ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించాలని ఓ ఐడియా ఆలోచించాడు. ఆలోచించిందే తడవుగా హోటల్ ముందు బోర్డు పెట్టేశాడు. అది చూసి జనం ఎగబడ్డారు. కానీ ఏదో ఆశించి వచ్చిన కస్టమర్లు చివరకు.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి బోల్తా కొట్టిందిరో బుల్ బుల్ పిట్ట అని సాడ్ సాంగ్ పాడుకుంటూ వెళ్లిపోయారు. ఇంతకీ ఆ హోటల్ ఇచ్చిన ఆఫర్ ఏంటి..? అక్కడేం జరిగిందంటే..?

ఏపీలోని వైఎస్సార్ జిల్లా మైదుకూరులో.. హోటల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ హోటల్‌ యాజమాన్యం ఒక బిర్యానీ కొంటే మరొక బిర్యానీ ఉచితమంటూ ఆఫర్‌ ప్రకటించాడు. బిర్యానీ లవర్స్ అంతా ఈ ఆఫర్ కోసం హోటల్ వద్ద ఎగబడ్డారు. దాంతో ఆ హోటల్ ముందు వాహనాలు బారులు తీరాయి. రోడ్డుపై వాహనాలు పెట్టి ట్రాఫిక్‌ అంతరాయం కలిగిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు చకచకా జరిమానాలు వడ్డించారు. ఒక్కొక్కరికి రూ.235 తగ్గకుండా వడ్డించినట్లు తెలుస్తోంది. వన్‌ ప్లస్‌ వన్‌ బిర్యానీ ఆఫర్‌ అని పోతే పోలీసులు జరిమానాలతో వడ్డించారు భయ్యా అంటూ జిహ్వ ప్రియులు చర్చించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news