మళ్లీ సర్వే చేసి..చంద్రబాబు నాకు టికెట్‌ ఇవ్వాలి – పార్థ సారథి

-

Pardha Saradhi  : మళ్లీ సర్వే చేసి..చంద్రబాబు నాకు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే…..కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు పార్థసారథి. అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది …రేపు వెళ్లుతున్నాను…..అభ్యర్థిని ప్రకటించి మళ్లీ మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న, ఎందుకు అధిష్టానం నాకు టికెట్ నిరాకరించిందో తెలియదన్నారు.

Pardha Saradhi comments on chandrababu

అధిష్టానం నన్ను , కాల్వ శ్రీనివాస్ ను ఎంపీగా పోటీ చేయమని అడిగితే ఖరాఖండగా తిరస్కరించాను…..అసెంబ్లీ అభ్యర్థిగానే నేను మీ ముందుకు వస్తానని ప్రకటించారు.
కార్యకర్తలు సంయమనం పాటించండి….రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని చెప్పారు. ఓపికతో కార్యకర్తలు ఉండాలి.. నియోజకవర్గ వ్యాప్తంగా అధిష్టానం వారు సర్వే చేయించుకుని మరలా టికెట్ ప్రకటించమని చంద్రబాబు నాయుడుని కోరుతానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news