పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ మరో కీలక ప్రకటన..ఏ క్షణమైనా !

-

పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరో కీలక ప్రకటన చేశారు. ఎన్డిఏలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త భాగస్వామ్య పక్షం వచ్చే అవకాశం పై రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నారు పవన్ కల్యాణ్. నిన్న ఎన్.డి.ఏ సమావేశంలో పొత్తులు, సీట్ల సర్దుబాటు గురించి చర్చ జరగలేదని వివరించారు.

కొత్త భాగస్వామ్య పక్షాల గురించి కూడా చర్చ జరగలేదని.. 2024లో మరలా ఎన్డిఏను అధికారంలోకి తీసుకురావాలి అన్న అంశం పై మాత్రమే చర్చ జరిగిందని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు, దేశానికి బలమైన నాయకత్వం అవసరం అని అప్పట్లో నేను అనుకున్నానని పేర్కొన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే దేశానికి మోడీ నాయకత్వం లభించిందని చెప్పారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news