రాష్ట్రంలో రౌడీయిజానికి పవన్ నాంది పలుకుతున్నాడు – మంత్రి ఉషశ్రీ చరణ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి ఉషశ్రీ చరణ్ కౌంటర్ ఎటాక్ చేశారు. మా ఎమ్మెల్యేలను కాదు.. కనీసం మా కార్యకర్తలను టచ్ చేసి చూడు ఏమి జరుగుతుందో? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజానికి పవన్ కళ్యాణ్ నాంది పలుకుతున్నాడని ఆరోపించారు. నియోజకవర్గాలలో తిరిగి చూడు ఏమి జరుగుతుందో? అని హెచ్చరించారు. నోటికి ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్.

చెప్పు చూపిస్తూ పార్టీ ఆఫీస్ లో మాట్లాడిన మాటలు పవన్ దిగజారుడు వ్యాఖ్యలకు నిదర్శనం అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. వైజాగ్ గర్జన సక్సెస్ కావడంతో పవన్ తో చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని అన్నారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే శంకర్ నారాయణ. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖ గర్జన జరిగిన రోజే పవన్ కళ్యాణ్ సమావేశం ఎందుకు పెట్టుకోవలసి వచ్చింది అని ప్రశ్నించారు. ముమ్మాటికి ఇది చంద్రబాబు నాయుడు డైరెక్టర్ అని అన్నారు. వైసిపి వారు కనుసైగ చేస్తే రాష్ట్రంలో నువ్వు తిరగగలవా? అని ప్రశ్నించారు. తొందరలో రాష్ట్ర ప్రజలు నిన్ను బట్టలూడదీసి పిచ్చికుక్కని కొట్టినట్లు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version