తమిళసై కోసం రంగంలోకి దిగిన పవన్‌ కళ్యాణ్‌

-

తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళసై కోసం రంగంలోకి దిగుతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. నేడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా చెన్నై సౌత్‌లో తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళిసైకి మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రోడ్డు షో ఉంటుంది. అనంతరం చెన్నైలో సాయంత్రం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసారు.

Pawan Kalyan election campaign in Tamil Nadu today

కాగా… జన సేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. ఇటీవలే జన సేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని పిటిషన్ వేసింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అయితే.. ఈ కేసును విచారించిన ఏపీ హై కోర్టు…జన సేన పార్టీ గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ డిస్మిస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news