విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు మిస్సింగ్ కంప్లైంట్..!

-

రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే గన్నవరం విమానాశ్రయంలో వివాహిత మహిళ కనపడటం లేదని డిప్యూటీ సీఎం ను ఆశ్రయించారు ఆమె బంధువులు. అయితే ఈనెల 8వ తేదీన ముదినేపల్లి నుండి విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వివాహిత మహిళ మిస్సింగ్ అయ్యింది.

ముదినేపల్లి మండలం ముదినేపల్లి గ్రామానికి చెందిన వివాహిత మహిళ 32 ఏళ్ళ కే.మహా లక్ష్మీ బావని గురించి ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. తమ సహోదరి కనపడడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించగా, నేను ప్రత్యేక బృందాలతో ఎంక్వయిరీ చేయించి మీకు అప్పగించే బాధ్యత నాదని వారికీ భరోసా ఇచ్చాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాంతో మిస్ అయిన వివాహిత బంధువులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన డిప్యూటీ సీఎం మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news