ఈనెల 17న తిరుపతికి పవన్ కళ్యాణ్

-

శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ ఇటీవల ఓ నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న జనసేన కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. ఈ నిరసనను ఆపివేసేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో సీఐ అంజు యాదవ్ పై వైసీపీ కార్యకర్తలా పనిచేస్తుందని జనసేన శ్రేణులు అగ్రహాం వ్యక్తం చేశారు. తాజాగా మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయంపై స్పందించింది. సదరు సీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 17న తిరుపతికి వెళ్ళనున్నారు. జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న సీఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news