PM MODI: బ్రూనై, సింగపూర్‌ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..షెడ్యూల్‌ ఇదే !

-

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇవాళ్టి నుంచి విదేశాలకు వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులో భాగంగానే.. బ్రూనై దారుస్సలాం , సింగపూర్ పర్యటనకు బయలు దేరారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు విదేశీ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన కూడా చేయడం జరిగింది. బ్రూనై దారుస్సలాంలో మొట్టమొదటిసారిగా ద్వైపాక్షిక పర్యటనకు వెళ్తున్నానని వెల్లడించారు.

PM Modi To Visit Brunei And Singapore’

ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 40 సంవత్సరాల సందర్భంగా, చారిత్రక సంబంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా మరియు ఇతర గౌరవనీయులైన రాజకుటుంబ సభ్యులతో సమావేశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఇవాళ బ్రూనై నుంచి, రేపు సింగపూర్‌ వెళ్లనున్నారు ప్రధాని మోడీ. రాష్ట్రపతి థర్మన్ షణ్ముగరత్నం, ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రి లీ సియన్ లూంగ్ మరియు ఎమిరిటస్ సీనియర్ మంత్రి గో చోక్ టోంగ్‌లతో సింగపూర్‌ లో సమావేశాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news