2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి.. సీఎం జగన్ ప్రకటన

-

2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం జగన్ ప్రకటన చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన సీఎం జగన్‌ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులు మూడు ప్రాంతాల ప్రజల హక్కు, ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ప్రతిపక్షాల పై పరోక్ష విమర్శలు చేశారు సీఎం జగన్‌. ఆర్ 5 జోన్ లో పేదల ఇళ్ళ నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకోవటం పై పరోక్షంగా విమర్శలు చేసిన సీఎం జగన్…పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు రాకుండా కోర్టుల్లో కేసులు వేయటం అంటరానితనం స్వరూపం అని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రతిపక్షాలు అడ్డుకోవటం పై సీఎం జగన్‌ కౌంటర్ ఇచ్చారు. ఇది పెత్తందారీ భావజాలం అని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news