BREAKING : ఏపీ విద్యార్థులకు అలర్ట్.. నేడు పాలిసెట్ ఫలితాలు

-

BREAKING : ఏపీ విద్యార్థులకు అలర్ట్.. నేడు పాలిసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 10:45 గంటలకు ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. కాగా, ఈ పరీక్షకు 1,43,625 మంది విద్యార్థులు హాజరయ్యారు.

కాగా, రేపే ఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు సెషన్లలో ఎగ్జామ్ జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో స్టేషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news