లోకేష్ పై పరువు నష్టం దావా వేయకూడదా? : పోసాని

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు  లోకేష్  నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై మంగళగిరి హై కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ పై పరువు నష్టం దావా వేయకూడదా అని ప్రశ్నించారు పోసాని.  ప్రధానంగా లోకేష్ నాపై రూ.4కోట్లు పరువు నష్టం దావా వేశారు పోసాని పరువు నష్టం దావా వేయకూడదా ? తాను పరువు నష్టం దావా కేసు వేస్తే..  కనీసం 20 ఏళ్లు జైలులో ఉంటాడు లోకేష్ అని పేర్కొన్నారు పోసాని. గతంలో లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలను పోసాని మీడియా ముందు ఉంచారు. పంచాయతీ  ఎన్నికల్లో కూడా గెలవని వాడు.. పంచాయతీ శాఖ మంత్రి అవుతాడా ? తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే ఇలా జరిగిందని..లోకేష్ పై గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించిన వ్యాఖ్యలను మీడియాకు చూపించారు పోసాని కృష్ణమురళి. 

Read more RELATED
Recommended to you

Latest news