లోకేష్ లాగా ఏపీ వాలంటీర్లు… తాగుబోతులు, తిరుగు బోతులు కాదు – పోసాని కృష్ణమురళి

-

వాలంటరీల వ్యవస్థ పై గతంలో చంద్ర బాబు ఏడ్చారని.. లోకేష్ లాగా ఏపీ వాలంటీర్లు… తాగుబోతులు, తిరుగు బోతులు కాదని చురకలు అంటించారు పోసాని కృష్ణమురళి. చంద్ర బాబు కు సిగ్గు ఉండాలి….వాలంటరీల వ్యవస్థ పై చంద్ర బాబు కు కన్ను పడిందని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థపై ఈసీ కి ఫిర్యాదు చేసింది నిమ్మగడ్డో ? క్యాన్సర్ గడ్డో? అంటూ నిలదీశారు. చంద్ర బాబు ఒక టైపు అనుకుంటే…పురంధేశ్వరి వంద టైపులు ఉందన్నారు.

పురంధేశ్వరి కి RSS అంటే ఏమి తెలుస్తుంది ? సావర్కర్ అంటే …గవాస్కర్ అనుకుంటుందంటూ పురంధేశ్వరి పరువు తీశారు. జగన్ మీద CJI కి లేఖ రాస్తారు పురందేశ్వరీ…మరి మోసాలు చేసిన సుజనా చౌదరి,సిఎం రమేష్ పై ఎందుకు రాయలేదు లేఖ ? అని నిలదీశారు. సుజన చౌదరి మోసాల పై పంప్లేట్ లు పంచుతానని స్పష్టం చేశారు. జయప్రద ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశారని… చంద్ర బాబుపై మండిపడ్డారు. చంద్ర బాబు 2014 లో ఆరు వందల హామీలు ఇచ్చారు…. ఏ హామీలు నిలబెట్టుకోడన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మేము సంతోషంగా ఉంటాం…చంద్ర బాబు,లోకేష్ తీర్థ యాత్ర లకు వెళ్ళండంటూ సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news