ఇండియా ఆర్థిక శక్తిగా మారడానికి కారణం ప్రధాని మోడీ – దగ్గుబాటి పురందేశ్వరి

-

ఇండియా ఆర్థిక శక్తిగా మారడానికి కారణం ప్రధాని మోడీ అన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారత దేశం ఈ పది సంవత్సరాలలో ఆర్థిక శక్తి గా ఐదోవ స్థానంలోకి వచ్చింది….ప్రధాని స్థానంలో మోదీ ఉంటే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారత దేశం వస్తుందని పేర్కొన్నారు. మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తి గా మూడో స్థానంలోకి భారతదేశం వస్తుంది…కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నే 60వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టారని వెల్లడించారు.

బీజేపీ ప్రభుత్వం పేదలకి ఇళ్ల నిర్మాణం, మరుగు దొడ్లు నిర్మాణం చేపట్టారు… బీజేపీ సిద్ధాంతం ఒకటే ఉంటుంది… ముందు దేశం తరువాత పార్టీ ఆ తరువాతే వ్యక్తి అన్నారు. బీజేపీ లో ఎవరైతే కస్టపడి పనిచేస్తారో వారిని గుర్తించి అందరికి సమూచిత స్థానం కలిపిస్తుంది… ముస్లిం మైనారిటీ మహిళలకి సోదర భావంతో మోదీ అండగా నిలిచారని వెల్లడించారు.

మైనారిటీ మహిళలకి కుటుంబ పెద్దగా మోదీ ఒక సహసపేతమైన నిర్ణయం తీసుకున్నారు… భారత సైనికులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులని ఖండించి సర్జికల్ స్ట్రైక్ చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. బాల రాముడి నిర్మాణం చేపడితే రక్త శిక్తం అవుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి…కానీ రాముడి అశీసులతో ప్రశాంతమైన వాతావరణంలో మోదీ బాల రాముడి మందిరం నిర్మాణం చేపట్టారన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news