సజ్జలపై పురంధేశ్వరి సీరియస్‌…మా కుటుంబం కలిస్తే తప్పేంటి ?

-

సజ్జలపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సీరియస్‌ అయ్యారు. మా కుటుంబం కలిస్తే తప్పేంటి ? అంటూ నిలదీశారు. బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయంలో శంఖ నాధం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకి శంఖనాధం పూరిస్తున్నామని.. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని వెల్లడించారు.

కేంద్రం ఏపీకి అందించే నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కోరారు. సోషల్ మీడియాలో ప్రచారం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థాయికే పరినితం కాకుండా.. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టాలని తెలిపారు. కుటుంబం అంతా వెళ్లి ఎన్టీఆర్ స్మారక నాణెంలో పాల్గొంటే తప్పు పడతారా..? అని సజ్జలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. సజ్జల రాష్ట్రపతి భవనుకు రాజకీయ రంగు పులిమారు.. ఇది సరికాదన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంపై ఎవరో ఏదేదో మాట్లాడుతున్నారు.. వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news