తాగుబోతు లాంటి భర్తే..జగన్‌ పై మాజీ ఎంపీ సంచలనం !

-

ఒక తాగుబోతు అయిన భర్త తన వ్యసనాల కోసం ఇంటిని, భార్య మెడలోని తాళిబొట్టును తాకట్టు పెట్టినట్లుగానే, ఈ ప్రభుత్వ అధినేత డబ్బు వ్యసనంతో సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టేశాడని రఘురామకృష్ణ రాజు అన్నారు. భార్య మెడలోని తాళిబొట్టు, ఇల్లు తాకట్టు పెట్టి తినడానికి నాలుగు బియ్యం గింజలను తెచ్చిన వాడిని మహానుభావుడని అంటామా అని ప్రశ్నించారు. ఇంటిని, ఇంటి ఇల్లాలు తాళిబొట్టును తాకట్టు పెట్టిన వాడిని ఎలా క్షమించలేమో, ఈ ప్రభుత్వ పెద్దలను కూడా అలాగే క్షమించవద్దని రఘురామకృష్ణ రాజు కోరారు.

raghurama-krishnam-raju- on vyugam movie

సెక్రటేరియట్ ను తాకట్టు పెడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదని, రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అంతుచిక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన అంశాన్ని సాక్షి దినపత్రికలో ఖండిస్తారని భావించానని, ఖండించలేదంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారని స్పష్టం అవుతుందని అన్నారు. లేకపోతే రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఇవేమి రాతలని సాక్షి దినపత్రికలు రాసుకుని ఉండేవారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 261 (1), 293(3) లను ఈ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news