రేవంత్ రెడ్డిని జగన్ అభినందిండం ఏంటీ ? – రఘురామ

-

సహచర ఎంపీలతో పాటు, సన్నిహిత మిత్రులైన ఎంపీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన వైకాపా ఎంపీలపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అగ్గి మీద గుగ్గిలం అయినట్లు తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. అదే రోజు వైకాపా ఎంపీలకు, విజయసాయిరెడ్డి కూడా ఓ విందును ఇచ్చారని, ఆ విందుకు తనను పిలవ లేదని, విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన విందుకు హాజరైన వైకాపా ఎంపీలు, రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించకపోయినప్పటికీ, ఆయన్ని అభినందించేందుకు వచ్చారని తెలిపారు.

రేవంత్ రెడ్డి గారు కూడా వారిని సాదరంగా ఆహ్వానించి, ఒక్కొక్కరిని పేరు పెట్టి పలకరించి తన సంస్కారాన్ని చాటుకున్నారని తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి గారిని అభినందించేందుకు వెళ్లిన సొంత పార్టీ ఎంపీలపై జగన్ మోహన్ రెడ్డి గారు అగ్గి మీద గుగ్గిలమై, రానున్న ఎన్నికల్లో టికెట్లు లేవని అన్నట్లుగా తెలిసిందని అన్నారు. ఇప్పటికే ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయమని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తారో.. ఇవ్వరో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రియ మిత్రుడు ఒకరు జనసేన వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news